AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. మరో మూడు నెలల పాటు మరటోరియం పెంచారు గవర్నర్. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకూ అంటే 90 రోజుల..

బ్రేకింగ్: మరో మూడు నెలల మారటోరియం పెంచిన ఆర్బీఐ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 22, 2020 | 10:54 AM

Share

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు భారీ ఊరట కల్పించారు. మరో మూడు నెలల పాటు మరటోరియం పెంచారు గవర్నర్. జూన్ 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకూ అంటే 90 రోజుల మారటోరియం పెంచింది ఆర్బీఐ. ఆయన మాట్లాడుతూ.. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి అంటే 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అలాగే మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. సిమెంట్ ఉత్పత్తిలో 25 శాతం తగ్గిందని పేర్కొన్నారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది. ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూ లేని విధంగా క్షీణత నమోదు చేసిందని గవర్నర్ శక్తి కాంత్ దాస్ వివరించారు.

ఇది కూడా చదవండి: 

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..