AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ వేళ కూతపెట్టనున్న స్పెషల్ ట్రైన్స్..

బెంగుళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పుర్‌లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను.. ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లను నడపాలని రైల్వే శాఖను కోరింది భారత సైన్యం. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ..

లాక్‌డౌన్ వేళ కూతపెట్టనున్న స్పెషల్ ట్రైన్స్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 17, 2020 | 10:10 AM

Share

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించింది కేంద్ర ప్రభుత్వం. మొదట ఏప్రిల్ 14వ తేదీ వరకూ విధించినా.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా దీన్ని మే 3వ తేదీ వరకూ పొడిగించారు ప్రధాని మోదీ. దీంతో అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. అయితే కొన్ని మినమాయింపులతో గూడ్స్ రూళ్లు, అత్యవసర, నిత్యావసర వస్తువల సరఫరా చేసే వాహనాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రెండు ప్రత్యేక రైళ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

బెంగుళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పుర్‌లోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను.. ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు ఈ రెండు రైళ్లను నడపాలని రైల్వే శాఖను కోరింది భారత సైన్యం. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. కాగా ఏప్రిల్ 17, 18 తేదీల్లో ఈ రైళ్లు తిరగనున్నాయి. ఉత్తర, ఈ శాన్య సరిహద్దుల్లో కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ ప్రాంతాల్లోని సైనికులను ఆయా సరిహద్దులకు తరలించేందుకు.. రైల్వే శాఖ సాయంతో రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయిచించినట్టు భారత సైన్యం ప్రత్యేక అధికారులు పేర్కొన్నారు. మొదటి రైలు ఏప్రిల్ 17న బెంగుళూరు నుంచి బయల్దేరి జమ్మూకు చేరుకుంటంది. రెండో రైలు ఏప్రిల్ 18న బెంగుళూరు నుంచి గువమటికి బయల్దేరుతుందని వారు తెలిపారు.

Read More:  

రికార్డు సృష్టించిన బంగారం.. రూ. 47 వేలకు చేరువ

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌లో కరోనా పేషెంట్ అరెస్ట్.. దేశంలోనే ఫస్ట్ టైమ్

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: భారీగా తగ్గిన చమురు విక్రయాలు