AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Video Conference: దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. సీఎంలకు దిశా నిర్దేశం చేసిన ప్రధాని మోదీ..

PM Modi: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదంటూ తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. కరోనా కేసులు పెరిగినా ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా కట్టడికి ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్లాలి? దీనిపై ముఖ్యమంత్రులతో...

PM Modi Video Conference: దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. సీఎంలకు దిశా నిర్దేశం చేసిన ప్రధాని మోదీ..
Pm Modi
Sanjay Kasula
|

Updated on: Apr 08, 2021 | 9:49 PM

Share

PM Modi-CMs Meeting: దేశంలో మరోసారి లాక్‌డౌన్ లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ. అలాగని కరోనాను లైట్ తీసుకోవద్దని రాష్ట్రాలకు సూచించారు. టెస్టులు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని కోరారు. మాస్ వ్యాక్సినేషన్ కోసం ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ వ్యాక్సినేషన్ ఉత్సవ్ నిర్వహించాలని ప్రకటించారు ప్రధాని.

ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నందున మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఉద్దేశం లేదని రాష్ట్రాలకు స్పష్టం చేశారు ప్రధాని మోదీ. సెకండ్ వేవ్‌లో కరోనా కేసుల పెరుగుదల ప్రమాదకరంగా ఉందని.. దీన్ని కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ మంచి ప్రత్యామ్నాయమని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూకి కరోనా కర్ఫ్యూగా పేరు పెట్టాలని కోరారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్న మోదీ.. కేసుల్ని తగ్గించేందుకు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ తప్పదని సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచడం…కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ సోకిన వాళ్లను ఐసోలేట్ చేయడం ముఖ్యమని చెప్పారు.

దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో పాటు ఆరోగ్య సదుపాయాలు మెరుగయ్యాయని ప్రధాని గుర్తు చేశారు. 45 ఏళ్లు దాటిన వాళ్లందరికీ వందశాతం వ్యాక్సిన్లు అందించాలని రాష్ట్రాలను కోరారు. వ్యాక్సిన్లు వృధా చేయవద్దని కోరారు. వ్యాక్సిన్లు వృధా కాకుండా అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు వీలుగా ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తామని తెలిపారు.

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్‌లో అక్కడక్కడా సమస్యలు ఎదురవుతున్నాయని… వీటి్ని అధిగమించేందుకు యువత అందరికీ సహకరించాలని కోరారు. కరోనాపై అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, ప్రముఖుల సహకారం తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రులు పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి గవర్నర్లు చొరవ తీసుకుని.. ప్రజాప్రతినిధులతో వెబినార్లు నిర్వహించాలన్నారు మోదీ. టెస్టింగ్, వ్యాక్సినేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్రాలను కోరారు.

ఇవి కూడా చదవండి: Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..

Follow Us
విండీస్ ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్ లో టీమిండియా
విండీస్ ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్ లో టీమిండియా
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
పుట్టిన రోజున 251 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయించిన హీరోయిన్
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
తరచూ మర్చిపోతున్నారా..? పిల్లల మెమోరీని పెంచే సూపర్ టిప్స్ ఇదిగో.
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
స్టార్ హీరోతో 220 కోట్ల సినిమా.. దెబ్బకు అట్టర్ ప్లాప్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం చివరి అవకాశం.. లేకపోతే డబ్బులు కట్
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
వాస్తు: ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం..!
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
ఇదెక్కడి బౌలింగ్ సామీ.. టీ20 వరల్డ్ కప్‌లో సరికొత్త మైలురాయి..
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
రక్షణ నుంచి అంతరిక్షం వరకు.. మన బంధం చెక్కుచెదరనిది.. మోదీ
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..
నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు..