ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ని కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతానని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో గత మూడు, నాలుగు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పదుల సంఖ్యలో నమోదవడంతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. దీంతో ప్రజలు మరింత జాగ్రత్త తీసుకోవాలన్నారు.
అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ అందరూ ఎంతో గొప్పగా పని చేస్తున్నారన్నారు కేసీఆర్. మొదటి రెండు మూడు రోజులైతే నిద్రాహారాలు మానేసి పని చేశారని ప్రశంసించారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి వీరంతా తీవ్రంగా శ్రమించారని చెప్పారు. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మందికి పాజిటివ్ వచ్చిందని… ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ అయ్యారని, 11 మంది చనిపోయారని తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని… ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి పాజిటివ్ వచ్చిందని… వారి కుటుంబ సభ్యుల్లో 92 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం తెలిపారు కేసీఆర్. అలాగే ఎవరికైనా కరోనా ఉన్నట్టు అనుమానాలుంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
ఇవి కూడా చదవండి:
బ్రేకింగ్: లాక్డౌన్ని కొనసాగించాలని ప్రధానిని కోరుతున్నా
సొంతూరికి వెళ్లడానికి శవం గెటప్.. ఐదుగురిపై కేసు
గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!
దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?
ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్