గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యం.. అసలేం జరిగిందంటే!
గాంధీ ఆసుపత్రిలో 'కరోనా రోగి' అదృశ్యమయినట్లు కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇది నిజమో.. అబద్దమో తెలీక జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే.. ఆ ఒక్క వ్యక్తి వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం లేదు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్..
గాంధీ ఆసుపత్రిలో ‘కరోనా రోగి’ అదృశ్యమయినట్లు కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇది నిజమో.. అబద్దమో తెలీక జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే.. ఆ ఒక్క వ్యక్తి వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అందులోనూ.. హైదరాబాద్లో ఈ కరోనా కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనా సోకవడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. బాధితులను, కుటుంబ సభ్యులను, బంధువులను, వారిని కలిసిన వారినందర్నీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు.
అలాగే రాష్ట్రంలో కూడా మరింతగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇకపై అన్ని రకాల నిత్యావసరాలను ఇంటికే హోమ్ డెలివీరీ అయ్యేలా చూస్తామన్నారు. కాగా.. ఇప్పుడు గాంధీలో కరోనా సోకిన రోగి మిస్ అవడంతో.. ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాలను పోలీసులు జల్లెడ పట్టారు. కానీ చివరికి వేరే వార్డులో ఉంచినట్లు గుర్తించారు. అలాగే.. ఆస్పత్రిలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. మరింత భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. కాగా ప్రస్తుతం తెలంగాణలో 321 కరోనా కేసులు నమోదవ్వగా.. ఏడుగురు మరణించారు.
ఇవి కూడా చదవండి:
దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలా? మరెక్కడా చోటు లేదా?
ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్
వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు
కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..
రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..
రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..