ప్రముఖ నిర్మాత కుమార్తెకు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి.. రోజురోజుకీ పట్టిపీడిస్తోంది. తాజాగా భారతదేశ వ్యాప్తంగా 4 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 100కి పైగా వ్యక్తులు మరణించారు. తాజాగా ముంబైలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి..
కరోనా మహమ్మారి.. రోజురోజుకీ పట్టిపీడిస్తోంది. తాజాగా భారతదేశ వ్యాప్తంగా 4 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 100కి పైగా వ్యక్తులు మరణించారు. తాజాగా ముంబైలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి ఈ వైరస్ సోకడం తాజాగా కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం జరిపిన వైద్య పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని నిర్మాత కరీమ్ స్వయంగా వెల్లడించారు.
‘షాజాకు కరోనా లక్షణాలు ఏం కనిపించలేదు కానీ పాజిటివ్గా తేలింది. మరో కుమార్తె జోయాకు పరీక్షలు జరిపాం. అయితే ఆమెకు నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ఐసోలేషన్లో ఉన్నారు. షాజా మార్చి తొలివారంలో శ్రీలంక నుంచి, జోయా మార్చి 15న రాజస్థాన్ నుంచి వచ్చారని’ కరీమ్ మొరానీ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా.. కీరమ్ మొరానీ హీరో షారుఖ్ ఖాన్కి ఆప్తుడు. అతడితో రావన్, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూయర్, దిల్వాలే సినిమాలను నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
వైసీపీ ప్రభుత్వం కూడా 5 వేలు ఇవ్వాలి: చంద్రబాబు
కర్ఫ్యూ సమయంలో కాగడాలతో హల్చల్, రాజాసింగ్ వీడియో వైరల్..
రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..
రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..
మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్లో కష్టాలు
ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు
బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం