కర్ఫ్యూ సమయంలో కాగడాలతో రాజాసింగ్ హల్చల్.. వీడియో వైరల్..
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేసి, ఇంట్లో 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని చెప్పారు. అప్పటికీ ఆయన పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని,..
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేసి, ఇంట్లో 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించమని చెప్పారు. అప్పటికీ ఆయన పదే పదే లక్ష్మణ రేఖ గీస్తూ ఎవ్వరూ ఇళ్లల్లోంచి బయటకు రావొద్దని, ఒకవేళ బాల్కనీలోకి వచ్చినా.. అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరారు.
కానీ దేశమంతా ప్రజలు దీపాలు పెట్టమంటే దీపావళి చేశారు. కొన్ని ప్రదేశాల్లో టపాకాయలు కాల్చుతూ.. రాకెట్లు కూడా వదిలారు. మరికొందరైతే ఏకంగా ర్యాలీలు కూడా తీశారు. కాగడాలు పట్టుకొని గో కరోనా.. గో కరోనా అంటూ జపం చేస్తూ.. వీధుల్లో తిరిగారు.
ప్రజలు ఏదో తెలీక చేశారను కోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఇలా చేయడం మరి విడ్డూరంగా ఉంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న ప్రధాని మోదీ పిలుపుకు స్పందిస్తూనే ఆయన గీసిన సోషల్ డిస్టెంసింగ్.. లక్ష్మణ రేఖను దాటారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. తమ శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Sequel to Go Corona Go is here. “Chinese Virus Go Back” Ft. Raja Singh, BJP MLA from Goshamahal, Hyderabad #9बजे9मिनट pic.twitter.com/lxuQbGYflG
— No Show Rajneesh (@GochiwaleGuruji) April 5, 2020
ఇవి కూడా చదవండి:
రేపే సూపర్ ‘పింక్ మూన్’.. కానీ మనం చూడలేం..
రూ.30 వేల కోట్లకి పటేల్ విగ్రహం అమ్మకం.. వైద్య పరికరాల కోసం..
మహారాష్ట్ర ఉల్లితో మలక్ పేట్ మార్కెట్లో కష్టాలు
ఏపీలో ఇంటింటికి వెళ్లి రూ. వెయ్యి అందిస్తోన్న వాలంటీర్లు
బ్రేకింగ్: భారత సైన్యం భారీ ఆపరేషన్.. తొమ్మిది మంది ఉగ్రవాదులు హతం