గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!

అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అక్కర్లేదని తెలిపింది. అయితే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడున్న పరిస్థితుల బట్టి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించుకోవచ్చునని.. ఆ విషయంపై ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని కేంద్రం […]

గుడ్ న్యూస్.. పాస్‌లు లేకుండానే అంతర్రాష్ట్ర ప్రయాణాలు.. కానీ!
Follow us

|

Updated on: May 31, 2020 | 3:54 PM

అనుకున్నట్లుగానే జరిగింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరిన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక నుంచి అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రజలకు, సరుకుల రవాణాకు ఎలాంటి ప్రత్యేక పాస్‌లు అక్కర్లేదని తెలిపింది. అయితే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అక్కడున్న పరిస్థితుల బట్టి అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం విధించుకోవచ్చునని.. ఆ విషయంపై ప్రజలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని కేంద్రం సూచించింది.

కాగా, జూన్ 30 వరకు కేంద్రం విధించిన లాక్ డౌన్ మూడు దశలుగా ముగియనుంది. మొదటి దశలో జూన్ 8 నుంచి ప్రార్ధనా మందిరాలు, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోనున్నాయి. రెండోదశలో(జూలై 20 తర్వాత) విద్యాసంస్థలను తెరిచే అంశంపై అప్పటి పరిస్థితి బట్టి కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇక మూడోదశలో మెట్రో సర్వీసులు, థియేటర్లు, పబ్‌లు, అంతర్జాతీయ విమానలు,స్విమ్మింగ్ పూల్స్,పార్క్‌లు, జిమ్‌ల రీ-ఓపెన్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రతీ ఒక్కరూ కూడా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ సమయాన్ని కూడా కేంద్రం తగ్గించింది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే.