శుభవార్త.. కేరళలో నేడు ఒక్క కేసు లేదు.. అంతేకాదు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కేసులు నమోదవ్వగా… వెయ్యి మందకి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం సంతోషాన్ని కల్గిస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలు కేసులు లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు […]

శుభవార్త.. కేరళలో నేడు ఒక్క కేసు లేదు.. అంతేకాదు..
Follow us

| Edited By:

Updated on: May 01, 2020 | 7:56 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేలకు పైగా కేసులు నమోదవ్వగా… వెయ్యి మందకి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం సంతోషాన్ని కల్గిస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాలు కేసులు లేకుండా ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కేరళ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి బయటపడి మరో తొమ్మిది మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి బయటపడిన 392 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 102 మంది కరోనాతో పోరాడుతున్నారని కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 498 కేసులు నమోదయ్యాయి.