AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు నచ్చింది… మీరు చూడండి…

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ […]

నాకు నచ్చింది... మీరు చూడండి...
Sanjay Kasula
|

Updated on: Jun 24, 2020 | 3:59 PM

Share

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

చెర్నోబిల్‌ వెబ్‌ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్న చైతూ పేర్కొన్నారు. అది స్పూర్థిదాయకంగా ఉందని.. అందరూ చూడాలంటూ సూచించారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాకు బాగా నచ్చింది ఈ సిరీస్‌ అంటూ పోస్ట్ చేశారు. అద్భుత నటన.. రచన, నిర్మాణ విలువలు బాగున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా స్పూర్థిదాయకంగా ఉంది. మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పక చూడండని పేర్కొంటూ చెర్నోబిల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చైతు చెప్పడమే ఆలస్యం… చూస్తామంటూ రీ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.