AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్: భారత్‌లో 96 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్కో రోజులోనే 512 మంది మృతి..

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 36,652 కొత్త కరోనా కేసులు అయ్యాయి.

కరోనా అప్‌డేట్: భారత్‌లో 96 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక్కో రోజులోనే 512 మంది మృతి..
Shiva Prajapati
|

Updated on: Dec 05, 2020 | 10:59 AM

Share

Coronavirus: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 36,652 కొత్త కరోనా కేసులు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96 లక్షలు దాటింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఆ బులెటిన్ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,57,763 మందికి కరోనా టెస్టులు చేయగా, 36,652 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇక తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 96,08,211కి చేరుకుంది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 512 మంది మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,39,700 లకు చేరింది. ఇక 90,58,822 మంది కరోనా బారి నుంచి కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 4,09,689 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.03 శాతం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, భారత దేశ రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికం కావడం విశేషం. అలాగే దేశ వ్యాప్తంగా మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.