AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు ఆస‌క్తిక‌ర ట్వీట్‌..

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలైన ఓ గర్భిణి శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినిచ్చింది.

గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు ఆస‌క్తిక‌ర ట్వీట్‌..
Jyothi Gadda
|

Updated on: May 09, 2020 | 9:06 AM

Share

క‌రోనాపై పోరులో  గాంధీ ఆస్ప‌త్రి వైద్యుల సాహ‌సాన్ని అభినందించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. క‌రోనా సోకినా మ‌హిళ‌కు సుర‌క్షితంగా పురుడు పోసిన వైద్యుల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను ‘కనిపించే దైవాలు’గా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఓ మహిళ గాంధీ ఆస్ప‌త్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేప‌థ్యంలో మంత్రి హ‌రీశ్‌రావు ట్విట్ట‌ర్ ద్వారా  స్పందించారు.

‘‘కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ హాస్పిటల్ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్.. హరీశ్ రావు ట్వీట్‌ను రీట్వీట్ చేసి ఈ విధంగా స్పందించారు. ‘‘మీ అభినందనలకు ధన్యవాదములు. మీ శుభాకాంక్షలు మేం మరింత ఉత్సాహంతో పనిచేయడానికి దోహదపడతాయి.’’ అని కామెంట్ చేశారు.

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలైన ఓ గర్భిణి శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినిచ్చింది.  ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణికి గైనకాలజీ విభాగం వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. సదరు మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వారందరూ కూడా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లోనే చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కరోనా సోకిన మహిళకు జన్మించిన బిడ్డకు కరోనా సోకిందా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.