AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనాపై యుద్ధంః మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య‌ భారీ విరాళం

కరోనా మహమ్మారిని నిర్ములించడానికి ఆయా దేశాల‌, రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో రోజు వారి కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరిని ఆదుకోవడానికి, విరాళాలు ఇవ్వడానికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే..

క‌రోనాపై యుద్ధంః మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భార్య‌ భారీ విరాళం
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2020 | 11:08 AM

Share

ప్రపంచ‌దేశాలు ప్ర‌స్తుతం కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నాయి. ఈ వైరస్ భూతం ప్ర‌జ‌ల్ని హడలెత్తిస్తోంది. అగ్రరాజ్యాలు కూడా వైర‌స్ కొర‌ల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అన్ని దేశాలు కలిసి ఈ వైరస్‌పై అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం యుద్ధం చేస్తోంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు సరైన మందును కనిపెట్టలేకపోయారు.

కరోనా మహమ్మారిని నిర్ములించడానికి ఆయా దేశాల‌, రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో అనేక పరిశ్రమలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. ఇది రోజు వారి కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడానికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్థాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణగోపాల్ మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ ట్విట్టర్‌లో తెలిపింది.