మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే 4.3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే 4.3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,719కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 2,66,883 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,49,214 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Maharashtra reported 9,601 COVID-19 cases and 322 deaths today, taking total cases to 4,31,719 including 2,66,883 recoveries and 15,316 deaths. Number of active cases stands at 1,49,214 out of which 46,345 cases are in Pune: State Health Department pic.twitter.com/SX3hobl7cS
— ANI (@ANI) August 1, 2020
Read more
ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు