బిగ్ బ్రేకింగ్: ఈ నెల 31 వరకూ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు

| Edited By:

May 17, 2020 | 5:40 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేంద్రం. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. మరో 14 రోజులపాటు దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా....

బిగ్ బ్రేకింగ్: ఈ నెల 31 వరకూ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపు
Telangana Lockdown
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేంద్రం. మే 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది. మరో 14 రోజులపాటు దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా.. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ లాక్‌డౌన్ పొడిగించడం ఇది నాలుగోసారి. ప్రధాని నరేంద్ర మోదీ విధించిన లాక్‌డౌన్ ఈ రోజుతో ముగియనున్న కారణంగా.. మరో 14 రోజులు అంటే.. ఈ నెల 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగించింది కేంద్రం. కాగా ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ పొడిగించాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరింతగా విజృంభించడంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులు ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికాంగా ఉంటాయని భావిస్తున్నారు. కాగా దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కాసేపట్లో కేంద్రం కొత్త మార్గ దర్శకాలను విడుదల చేయనుంది.


Read More:

రూ.20 లక్షల కోట్లు.. ఏ రంగానికి ఎంతంటే?

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం