గుడ్న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం
ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్నారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత..
ఆత్మ నిర్భర్ 5.0లోని కీలకాంశాలు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇదే చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు రంగాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను వెల్లడిస్తున్నారు. చివరి ప్యాకేజీలో ఏడు రంగాలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. పేదలు, వలసకూలీల ఆకలి తీర్చడం మా బాధ్యత అన్నారు. 8.19 కోట్ల మంది రైతులకు సాయం అందించామన్నారు. రాష్ట్రాలకు తగిన విధంగా సాయం చేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు. అందుకే పేదలకు నేరుగా నగదును బదిలీ చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి.
ఈ నేపధ్యంలో పేదలకు గుడ్న్యూస్ చెప్పారు ఆమె. ఉజ్వల పథకం కింద మూడు నెలల పాటు పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తామన్నారు. అలాగే 12 లక్షల మందికి ఈపీఎఫ్లో చందాదారులు ఆన్లైన్ ఉపసంహరణతో లబ్ధిపొందారన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఇస్తున్నామన్నారు. జన్ధన్ ఖాతాల్లో రూ.10,025 కోట్లు జమ చేశాం. దీని ద్వారా 20 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే వలస కూలీల తరలింపులో 85 శాతం ఖర్చును భరిస్తున్నామన్నారు నిర్మాలా సీతారామన్.
Read More:
ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !