టీవీ సీరియల్స్ షూటింగ్లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం
టీవీ సీరియల్స్ షూటింగ్లకు కర్నాటక ప్రభుత్వం అనుమతిస్తూ.. గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది. దీంతో అన్ని రకాల బిజినెస్లు మూతపడ్డాయి. అందులో సినీ ఇండస్ట్రీ కూడా ఉంది. కరోనా దెబ్బకు సీరియల్స్ షూటింగ్లు..

టీవీ సీరియల్స్ షూటింగ్లకు అనుమతిస్తూ.. కర్నాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రకాల బిజినెస్లు మూతపడ్డాయి. అందులో సినీ ఇండస్ట్రీ కూడా ఒకటి. కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులతో పాటు సీరియల్స్ చిత్రీకరణలు కూడా నిలిచిపోయాయి. దీంతో సీరియల్స్ ప్రసారాలను ఆపివేశాయి టీవీ ఛానెల్లు.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్నింటికి సడలింపులు ఇస్తూ లాక్డౌన్ ఆంక్షలు ఇచ్చింది. దీంతో కన్నడ టెలివిజన్ సంఘం అధ్యక్షుడు శివకుమార్ సీఎం యాడియూరప్పను కలిసి.. షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరారు. లాక్డౌన్ కారణంగా సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి జీవనంపై ప్రభావం పడిందని సీఎంకు పరిస్థితులను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కర్నాటక సీఎం యడియూరప్ప.. కొన్ని రూల్స్తో మినహాయింపులు ఇస్తూ టీవీ షూటింగులకు అనుమతిచ్చారు.
షూటింగులకు రూల్స్:
-షూటింగ్లో 12 మంది మాత్రమే ఉండాలి -ఎక్కువ మంది ఒకేచోట గుమికూడదన్నారు – అలాగే బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్లకు అనుమతి లేదు -తక్కువ మంది నటీనటులతో టీవీ సీరియల్స్ చిత్రీకరణ చేయాలి -కరోనా కేసులు లేని ప్రాంతాల్లో మాత్రమే సీరియల్స్ షూటింగులు చేయాలి -షూటింగ్ సమయంలో మాస్కులు, శానిటైజర్లు విరివిగా వాడాలి
Read More:
బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..