AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు తీపి కబురు..వారికి ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు

విద్యార్థులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులకు తీపి కబురు..వారికి ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2020 | 12:12 PM

Share

విద్యార్థులకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో సర్కార్ తీసుకున్న నిర్ణయం అక్కడి విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించనున్నట్లు స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి ప్రకటించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడి విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. 2019-20 విద్యాసంవత్సరంలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తామని తెలిపారు. 12వతరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లను అందించాలని నిర్ణయించినట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. మెరిట్ విద్యార్థులు ల్యాప్ టాప్ ల కొనుగోలుకు వీలుగా 25వేల రూపాయలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీనియర్ అధికారులతో మాట్లాడారు.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురవుతున్న ప్రజలకు సీఎం కీలక సూచన చేశారు. కరోనా సోకితే భయపడకండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ‘నేను బాగానే ఉన్నా..ప్రాణాలుపణంగా పెట్టి కరోనా వారియర్స్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. కరోనా పేషెంట్ల కోసం పని చేస్తున్న వారందరికీ సెల్యూట్’ అంటూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.