AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ వేళ..ఆర్టీసీ ఛార్జీల మోత..ఎక్కడంటే‌!

కరోనా, లాక్‌డౌన్ వేళ..అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రజా రవాణాపై భారీగా ఛార్జీల భారం వేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఛార్జీలను 25శాతం పెంచుతూ..

లాక్‌డౌన్ వేళ..ఆర్టీసీ ఛార్జీల మోత..ఎక్కడంటే‌!
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2020 | 7:47 PM

Share

కరోనా, లాక్‌డౌన్ వేళ..అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రజా రవాణాపై భారీగా ఛార్జీల భారం వేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఛార్జీలను 25శాతం పెంచుతూ కేరళ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. జ్యుడీషియ‌ల్ క‌మిటీ ఇచ్చిన సిఫారసుల మేర‌కు ఆర్టీసీ ఛార్జీలు పెంచాల‌ని నిర్ణ‌యించినట్లు కేర‌ళ స‌ర్కారు పేర్కొంది. ఈ మేరకు ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మాట్లాడుతూ..పెంచిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వివరించారు. క‌నీస‌ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయ‌లేద‌ని చెప్పారు. మినిమం ఛార్జీని ఎప్ప‌టిలాగే రూ.8గా నిర్ణ‌యించామ‌ని, క‌నీస దూరాన్ని మాత్రం 5 కిలోమీట‌ర్ల నుంచి 2.5 కిలోమీట‌ర్ల‌కు త‌గ్గించిన‌ట్లు పేర్కొన్నారు.

మరోవైపు, విద్యార్థుల బస్‌పాస్‌ల ఛార్జీలు కూడా పెంచాలని జ్యుడీషియ‌ల్ క‌మిటీ సూచించినట్లు రవాణాశాఖ మంత్రి ఏకే శశీంద్రన్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు మూసే ఉన్నందున స్టూడెంట్ బ‌స్‌పాస్ ఛార్జీల‌ను య‌థావిధిగా కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. కేరళలో ఆర్టీసీలో నెలకొన్న న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌పై అధ్య‌య‌నం కోసం కేర‌ళ స‌ర్కారు జ‌స్టిస్ ఎం రామ‌చంద్ర‌న్ నేతృత్వంలో జ్యుడీషియ‌ల్ క‌మిటీని నియ‌మించింది. క‌మిటీ సిఫార‌సుల‌లో ఛార్జీల పెంపు స‌హా కొన్నింటికి కేర‌ళ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే కమిటీ చేసిన సూచనల మేరకే ఛార్జీలు పెంచినట్లుగా రవాణా శాఖ పేర్కొంది.

Follow Us
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది