AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే సీఎం, మాజీ సీఎంలను..

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 09, 2020 | 10:58 PM

Share

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే సీఎం, మాజీ సీఎంలను తాకిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి బి. శ్రీరాములుకు కరోనా పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. అంతేకాదు.. కరోనా సోకిన పేషెంట్స్‌కు అందుతున్న వైద్య సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరానని మంత్రి శ్రీరాములు తెలిపారు. ఇటీవల కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారితో పాటు.. కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.