కేవలం 30 సెకన్లలో కరోనా పరీక్ష.. ఢిల్లీలో ట్రయల్స్..!
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రోజుకు అరలక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించాలంటే.. టెస్టుల సంఖ్య..
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రోజుకు అరలక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాను నియంత్రించాలంటే.. టెస్టుల సంఖ్య పెంచాల్సిందేనని.. అలా చేయడం ద్వారా.. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి చికిత్స అందించడం ద్వారా.. ఇతరులకు వ్యాపించకుండా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచేందుకు అనేక రకాల ప్రయోగాలను చేస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సాంకేతికతతో కలిసి ఓ పరీక్షా విధానాన్ని డెవలప్ చేశారు. ఇది సక్సెస్ అయితే.. కేవలం ముప్పై సెకన్లలోనే పరీక్ష పూర్తవ్వనుంది. దీనిని ప్రస్తుతం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.
కాగా, కరోనా మహమ్మారిని గుర్తించేందుకు నాలుగు పద్ధతులను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటికి ఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ట్రయల్స్ చేస్తున్నారు.ఇజ్రాయెల్, ఇండియా కలిసి నాలుగు వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షిస్తున్నాయి. అందులో రెండు పరీక్షల్లో లాలాజల నమూనాలతో పరిశీలించి.. కొద్ది నిమిషాలల్లోనే రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇక మూడవ విధానంలో.. పేషెంట్ స్వరం ఆధారంగా గుర్తించడం.. నాల్గవ విధానంలో శ్వాస నమూనాలోని రేడియో వేవ్ ద్వారా.. రిపోర్టులు రానున్నాయి.
Read more
ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు