ఐ యామ్ ఫైన్….కరోనా అంటే భయపడకండి…శివరాజ్ సింగ్ చౌహాన్
కరోనా పాజిటివ్ కి గురైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు. కరోనాపై పోరు జరుపుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వీరు నిస్వార్థంగా తమ ప్రాణాలను..

కరోనా పాజిటివ్ కి గురైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు. కరోనాపై పోరు జరుపుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వీరు నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వైరస్ మీద పోరాటం జరుపుతున్నారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ వైరస్ అంటే భయపడరాదని, ఏ మాత్రం పాజిటివ్ లక్షణాలు కనబడినా చికిత్స చేయించుకోవాలని కోరారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు.
प्रिय प्रदेशवासियों, आपको #COVID19 से डरने की जरूरत नहीं है। लक्षण प्रकट होते ही टेस्ट कराएं और पॉजिटिव होने पर तत्काल इलाज शुरू करवाएं तो कोरोना पर विजय अवश्य मिलेगी।
इससे लड़ने का प्रमुख अस्त्र है, मास्क और दो गज की दूरी। इन अस्त्रों का प्रयोग अवश्य करें। #MPFightsCorona pic.twitter.com/Pyu2h6gAia
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 26, 2020