రేకుల ఇంటికి రూ.19 లక్షలకు పైగా కరెంట్ బిల్లు.. షాక్‌లో ఇంటి యజమాని

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి కొందరు కరెంట్ బిల్లులను కట్టలేదు. దీంతో ఒకేసారి మూడు నెలల రీడింగ్ తీసే సరికి.. ఆ బిల్లులు చూసి కల్లు చెదురుతున్నాయి. తాజాగా ఓ రేకుల ఇంటి రూ.19 లక్షలకు పైగా బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన ఇల్లు అమ్మినా కూడా రూ.50 వేలు కూడా రాదని..

రేకుల ఇంటికి రూ.19 లక్షలకు పైగా కరెంట్ బిల్లు.. షాక్‌లో ఇంటి యజమాని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2020 | 5:40 PM

కరోనా లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి కొందరు కరెంట్ బిల్లులను కట్టలేదు. దీంతో ఒకేసారి మూడు నెలల రీడింగ్ తీసే సరికి.. ఆ బిల్లులు చూసి కల్లు చెదురుతున్నాయి. తాజాగా ఓ రేకుల ఇంటి రూ.19 లక్షలకు పైగా బిల్లు వచ్చింది. దాన్ని చూసిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన ఇల్లు అమ్మినా కూడా రూ.50 వేలు కూడా రాదని.. అంత బిల్లు నేను ఎలా కట్టేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మేకవనంపల్లికి చెందిన కే మల్లమ్మ, ఆమె భర్త ఇద్దరూ ఓ రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. వారు వాడేది ఒక బల్బు, ఒక ఫ్యాన్. అది కూడా రాత్రి వేళలో వాడుతూంటారు. లాక్‌డౌన్ కారణంగా డబ్బులు లేక గత రెండు నెలల బిల్లు చెల్లించలేదు. ప్రస్తుతం విద్యుత్తు సిబ్బంది రీడింగ్ తీయగా 5,33,946 యూనిట్లు వినియోగానికి.. రూ.19,58,194 బిల్లు వచ్చింది. దీంతో షాక్ తిన్న మల్లమ్మ.. వెంటనే విద్యుత్తు శాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ జానకీరాంను వివరణ కోరింది. దీనికి స్పందించిన సదరు ఇంజినీర్ పొరపాటున అలా వచ్చి ఉంటుందని.. దాన్ని మళ్లీ సరి చేస్తామని చెప్పుకొచ్చారు.

Read More:

నోకియా ఎక్స్‌ప్రెస్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 30 రోజులు..

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..