AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధానిలో తాజాగా మరో 1,398 పాజిటివ్‌ కేసులు

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయనుకున్న..

దేశ రాజధానిలో తాజాగా మరో 1,398 పాజిటివ్‌ కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2020 | 7:02 PM

Share

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయనుకున్న వేళ.. మళ్లీ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,398 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,139కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,40,767 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 11,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా బారినపడి 4,235 మంది మరణించారు. కాగా, గడిచిన కొద్ది రోజులుగా ఢిల్లీలో నిత్యం 15 నుంచి 20 వేల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం