Vaccine Certificate: వైద్య, ఆరోగ్య సిబ్బంది నిర్వాకం.. చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ సర్టిఫికేట్..!

చనిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకా వేసినట్లు సెల్‌పోన్ల ద్వారా మెసేజ్ లు రావడంతో వారి కుటుంబసభ్యులు షాక్‌కు గురి చేసింది.

Vaccine Certificate: వైద్య, ఆరోగ్య సిబ్బంది నిర్వాకం.. చనిపోయిన ఆరు నెలలకు వ్యాక్సిన్ సర్టిఫికేట్..!
Covid Vaccine
Follow us

|

Updated on: Dec 11, 2021 | 5:55 PM

Medical Officials Negligence: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలని సూచిస్తోంది. అయా రాష్ట్రాలు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి చేసే కరోనా కట్టడి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, సిబ్బంది చేస్తున్న నిర్వాకంతో ప్రభుత్వానికే మచ్చను తీసుకువచ్చింది. చనిపోయిన వ్యక్తిని బ్రతికి ఉన్నట్లు. బ్రతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లు అధికారులు లెక్కలు తారుమారు చేయడం ఇప్పటి వరకు చూశాం.. తాజాగా వైద్య ఆరోగ్య సిబ్బంది పలు తప్పులు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు మెసేజ్‌లు పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా చనిపోయిన వ్యక్తులకు కోవిడ్ టీకా వేసినట్లు సెల్‌పోన్ల ద్వారా మెసేజ్ లు రావడంతో వారి కుటుంబసభ్యులు షాక్‌కు గురి చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది.

రాజ్ ఘడ్ జిల్లాకు చెందిన పురుషోత్తం అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 8న కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన మే నెలలోనే మృతి చెందాడు. తాజాగా డిసెంబర్ 3న పురుషోత్తం సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అది చూసిన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేయగా.. అందులో రెండు డోసులు పూర్తైనట్లు ఉంది. విషయాన్ని డిస్ట్రిక్ట్ వ్యాక్సినేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా.. కంప్యూటర్ ఎర్రర్ కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని చెప్పారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. మరోవైపు బియోర బ్లాక్ మెడికల్ ఆఫీసర్ మాత్రం భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇలాంటి పొరపాట జరిగి ఉండొచ్చని సర్ధి చెప్పుకొచ్చారు. తమ సిబ్బంది పొరపాటున పురుషోత్తం ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారని చెప్పారు. త్వరలోనే తప్పును సరిచేస్తామని అన్నారు.

Read Also…  Students Hospitalised: సెలవుల కోసం చేసిన పని తోటి విద్యార్థుల ప్రాణం మీదకు వచ్చింది.. అసలు విషయం వెలుగులోకి రావడంతో..!