AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడికి కోవిడ్ పరీక్షలు

దివాకర్ ట్రావెల్స్ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్...

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడికి కోవిడ్ పరీక్షలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 12:56 PM

Share

దివాకర్ ట్రావెల్స్ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు చేశారు. కాగా వీటికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.

కాగా నేడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పరామర్శించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వారి ఇంటికి వెళ్లిన ఆయన దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో సమావేశం అయ్యారు. కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కడప జైలులో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కలిసేందుకు లోకేష్ అధికారులను అనుమతి కోరగా.. ప్రస్తుతం కొవిడ్-19 నిబంధనల కారణంగా వీలుకాదంటూ అనుమతిని నిరాకరించారు.

Read More: 

బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..

పెట్రోల్, డీజిల్ ధరల మోత.. తొమ్మిది రోజుల్లో రూ.5 పెంపు..

తిరిగి ప్రారంభమైన లోకల్‌ ట్రైన్లు.. వారికి మాత్రమే అనుమతి