Coronavirus: ఫ్లాష్ న్యూస్: భారత్లో 8కి చేరిన కరోనా మృతుల సంఖ్య..
Coronavirus: మానవజాతిని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య 424కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇక కోవిడ్ 19 కారణంగా ఇండియాలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన 68 ఏళ్ల ఫిలిప్పైన్స్ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మొదటి ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు […]
Coronavirus: మానవజాతిని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య 424కు చేరినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇక కోవిడ్ 19 కారణంగా ఇండియాలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన 68 ఏళ్ల ఫిలిప్పైన్స్ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మొదటి ఈ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు కోవిడ్ 19 నుంచి కోలుకోవడం జరిగింది. అయితే గత రాత్రి ఆ వ్యక్తి ఆసుపత్రిలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, చనిపోయిన వ్యక్తికి డయాబెటిస్, ఆస్తమా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ముంబైలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.
కాగా, దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలూ లాక్ డౌన్ అయ్యాయి. ఈ నెల 31 వరకు అత్యవసర సేవలు తప్పించి అన్నింటినీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేశాయి. అటు అత్యధికంగా మహారాష్ట్రలో 89 కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
For More News:
ఏపీ ప్రభుత్వం సంచలనం.. పేదల ఇళ్ల కోసం స్విస్ టెక్నాలజీ..
షాకింగ్: కరోనా వైరస్తో హీరోయిన్ తండ్రి మృతి…
కరోనా కట్టడికి మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం…
ఏపీ లాక్ డౌన్: ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలి..
రోహిత్కు కోపమొచ్చింది.. ఐసీసీ క్షమాపణ చెప్పింది..
కోరలు చాస్తున్న కరోనా.. భారత్లో 9కి చేరిన మృతుల సంఖ్య..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో బ్యాంక్ వేళల్లో మార్పులు…
వైరస్ వ్యాప్తి.. ఇంగ్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం..
ఫ్లాష్: భారత్లో 10వ కరోనా మరణం
A 68-year-old Philippines citizen, initially tested positive for #COVD19 but subsequently became negative, passed away yesterday. He was shifted from Kasturba hospital to a pvt hospital. He had developed acute renal failure&respiratory distress: Public Health Department, #Mumbai
— ANI (@ANI) March 23, 2020