AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UK COVID-19 : ఆ దేశంలో ఆగని కరోనా కల్లోలం.. మార్చి 8 వరకూ స్కూల్స్ బంద్ .. విద్యార్థులకు రోజూ ఆహార ప్యాకెట్లు పంపిణీ

రోనా వైరస్ యూరోపియన్ కంట్రీల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. బ్రిటన్  లో కరోనా వైరస్ రూపు మార్చుకుని స్టైయిట్ గా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంగ్లాండ్ లో కరోనా వైరస్..

UK COVID-19 : ఆ దేశంలో ఆగని కరోనా కల్లోలం.. మార్చి 8 వరకూ స్కూల్స్ బంద్ .. విద్యార్థులకు రోజూ ఆహార ప్యాకెట్లు పంపిణీ
Surya Kala
|

Updated on: Jan 28, 2021 | 1:52 PM

Share

UK COVID-19 : కరోనా వైరస్ యూరోపియన్ కంట్రీల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. బ్రిటన్  లో కరోనా వైరస్ రూపు మార్చుకుని స్టైయిట్ గా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇంగ్లాండ్ లో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గక పోవడంతో.. మార్చి 8 వరకూ పాఠశాలలను మూసివేస్తున్నామని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మార్చి 8 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి మళ్ళీ నిర్ణయాన్ని పున: సమీక్షిస్తామని తెలిపారు. పాఠశాలలు మళ్ళీ తెరచుకుని వరకూ అర్హులైన విద్యార్థులకు ఫుడ్‌ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాలు ఇస్తున్నామని.. పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామని .. అప్పుడే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Also Read: బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం.. ఇక్కడ శివుడిని పూజించిన భక్తుల కష్టాలు మాయం