AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో 2100కు చేరిన క‌రోనా..

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది.

ఏపీలో 2100కు చేరిన క‌రోనా..
Jyothi Gadda
|

Updated on: May 14, 2020 | 1:03 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 36 మందికి కరోనా సోకింది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100కు చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరొకరు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 48కి పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులలో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 15 మందికి కరోనా సోకింది.

ఏపీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2100కి చేరగా, మరణాల సంఖ్య 48కి పెరిగింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 1192 మంది కోలుకోగా, 860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో నెల్లూరులో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5 ఉండగా, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో రెండు చొప్పున, పశ్చిమగోదావరిలో మరో కేసు నమోదయ్యాయి. ఇవాళ మరణించిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన వారు కాగా, వైరస్‌ బారిన పడిన 50 మంది కోలుకుని ఈ రోజు డిశ్చార్జి అయ్యారు.
ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 591 కేసులు, గుంటూరులో 404, కృష్ణాల  351, చిత్తూరు 151, నెల్లూరు 126, అనంతపురంలో 118, కడప 99, పశ్చిమ గోదావరి 69, విశాఖపట్నం 66, ప్రకాశం 63, తూర్పుగోదావరి 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కేసుల చొప్పున న‌మోద‌య్యాయి.

Follow Us
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
సరదా కోసం వెళ్లి.. అమెరికా విమాన ప్రమాదంలో కర్నూలు వాసి మృతి
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి కివీస్‌పై లంక ఘన విజయం
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
అభిమాని కోరిక తీర్చేందుకు హనుమకొండకు పవన్ కళ్యాణ్..
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
ఏకంగా మూడు ఓటీటీల్లో టాప్‌లో ట్రెండింగ్ అవుతోన్న తెలుగు సినిమా
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రోహిత్ జూన్ 20నే చివరి వన్డే మ్యాచ్.. సోషల్ మీడియాలో పోస్ట్
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
రంభ తృతీయ వ్రతం.. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున ఈ పూజ చేస్తే సౌభాగ్యం
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీతోనే 1979 ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగాలు
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
క్యారెట్ వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు..
బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు
బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు
రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. లక్షల్లో జీతం
రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. లక్షల్లో జీతం