ముంబైలో కరోనా మహమ్మారి.. 77వేలు దాటిన పాజిటివ్ కేసులు..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే..

ముంబైలో కరోనా మహమ్మారి.. 77వేలు దాటిన పాజిటివ్ కేసులు..
Follow us

| Edited By:

Updated on: Jul 01, 2020 | 4:43 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ముంబై నగరంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి ముంబై నగరంలో 77 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు కొత్తగా 903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నగర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,197కి చేరింది. ప్రస్తుతం నగరంలో 28,473 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 44,170 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు. మరోవైపు అటు ధారవి మురికి వాడలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.