AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSWR COE CET 2023: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల 2023కు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి గాను 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’కు..

TSWR COE CET 2023: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల 2023కు దరఖాస్తులు ఆహ్వానం
TSTWREIS
Srilakshmi C
|

Updated on: Jan 27, 2023 | 9:56 PM

Share

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి గాను 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌- సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023’కు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంగ్లీష్‌ మీడియంలో ఎంపీసీలో 575 సీట్లు, బైపీసీలో 565 సీట్లు ఉన్నాయి. వీటిల్లో అడ్మిషన్లకు మొత్తం 1,140 మంది గిరిజన విద్యార్ధులను (బాలురు- 660, బాలికలు- 480) ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..

మార్చి-2023లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లోనైతే రూ.2,00,000, గ్రామాల్లోనైతే రూ.1,50,000లకు మించకుండా ఉండాలి. ఇంగ్లిష్‌/తెలుగు మాధ్యమంలో చదివిన వారుఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి 17 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం ఇలా..

మొత్తం 160 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. క్వశ్చన్‌ పేపర్‌ తెలుగు/ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్ ఉంటుంది. ఎంపీసీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్‌ (20 మార్కులు), మ్యాథ్స్‌(60 మార్కులు), ఫిజిక్స్‌(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు) సబ్జెక్టుల్లో పరీక్ష ఉంటుంది. బైపీసీకి నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఇంగ్లిష్‌ (20 మార్కులు), మ్యాథ్స్‌ (20 మార్కులు), ఫిజిక్స్‌(40 మార్కులు), కెమిస్ట్రీ(40 మార్కులు), బయాలజీ (40 మార్కులు) సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం

ఇవి కూడా చదవండి

ఆసక్తికలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతిఒక్కరూ రూ.100లు చెల్లించాలి. ప్రవేశ పరీక్ష మార్చి 12, 2023న ఉంటుంది. హాల్‌టికెట్లు ఫిబ్రవరి 27 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
అడవిలాంటి ఒత్తైన జుట్టు కావాలా?.. ఈ ఒక్క నూనె రాస్తే చాలు..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. కొత్త హైవే అందుబాటులోకి..
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
వేసవిలో పచ్చి మామిడి కాయలు తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు మీకు
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
మ్యాజిక్ ట్రిక్స్.. ఇవి ఫాలో అయితే బాత్రూమ్‌లో దుర్వాసన ఉండదు..
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే
ప్రపంచం ఒక 'కురుక్షేత్రం'.. ప్రధాని మోదీ 'సంబుద్ధి' మంత్రం ఇదే