పదో తరగతితో రైల్వే ఉద్యోగం.. ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ లేదు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. త్వరపడండి..

Railway Jobs - 2021 : ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంచి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి..

పదో తరగతితో రైల్వే ఉద్యోగం.. ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ లేదు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ.. త్వరపడండి..
Railway Job With Tenth Clas
Follow us

|

Updated on: Apr 03, 2021 | 7:35 PM

Railway Jobs – 2021: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంచి నోటిఫికేషన్‌ను రిలీజ్‌ చేసింది.. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.. 480 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ.. ఫిట్టర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్), మెకానిక్ (డిఎస్ఎల్), కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్ ఖాళీలు భర్తీ చేస్తారు. అయితే వీటి నియామకానికి ఎటువంటి పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. భర్తీ ప్రక్రియ పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఉంటుంది. మెరిట్‌ ప్రాతిపదికన క్యాండెట్స్ ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దీనికి ముందు అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ ఇండియా.ఆర్గ్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య 480 .. అభ్యర్థులు ఏదైనా గుర్తించబడిన బోర్డు లేదా సంస్థ నుంచి 50% మార్కులతో పదో తరగతి పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 24 ఏళ్లలోపు ఉండాలి. వయస్సు లెక్కింపు 5 మార్చి 2021 నుంచి నిర్ణయించబడుతుంది. గరిష్ట వయోపరిమితిలో, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు, ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇస్తామని పేర్కొన్నారు.

నార్త్ సెంట్రల్ రైల్వే (నార్త్ సెంట్రల్ రైల్వే, ఎన్ఆర్సి) జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ mponline.gov.in ని సందర్శించండి. తరువాత, హోమ్ పేజీలో నమోదు కోసం లింక్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ తరువాత దరఖాస్తు ఫారం నింపవచ్చు. అప్లికేషన్ నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి. దరఖాస్తు ఫారంలో ఏదైనా పొరపాటు జరిగితే, ఫారం తిరస్కరించబడుతుంది.

Sonu sood Fake Account: సోనూసూద్‌ పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు.. సాయం చేస్తానని నమ్మించాడు.. చివరకు..

Battle for Bengal: నాలుగో దఫాలో 60 శాతం కొత్తముఖాలతో పోటీకి తృణమూల్..కులాల లెక్కలతో బీజేపీ పోటీకి రె’ఢీ’!

అసోంలో ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలో ఆపిన నరేంద్ర మోదీ.. జనంలోకి వెళ్లిన ప్రధాని మెడికల్ టీమ్‌.. అసలేం జరిగిందంటే..?