Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2023: నేటి నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత పరీక్షలు గురువారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9.40 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు..

JEE Main 2023: నేటి నుంచి ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు
JEE Main 2023 Session 2
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 06, 2023 | 11:36 AM

జేఈఈ మెయిన్‌-2023 తుది విడత పరీక్షలు గురువారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 9.40 లక్షల మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తున్నారు. దేశంలో మొత్తం 330 నగరాల్లో, విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

కాగా గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌-2023కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక తుది విడత జేఈఈ మెయిన్‌ పరీక్షకు 9.40 లక్షల మందిల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే తొలిసారి కంటే మలిసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. ఈ రెండు సెషన్లలో వచ్చిన మార్కుల్లో బెస్ట్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకును కేటాయిస్తారు. రిజర్వేషన్ల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి ర్యాంకులను ప్రకటిస్తారు. వీరిలో తొలి రెండున్నర లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జూన్‌ 4న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
టాలీవుడ్‌లో విచిత్రం.. స్టార్ హీరోలకు గండం.. ఏంటంటే ??
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
GT vs PBKS: టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ 11తో హీటెక్కించారుగా
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
ఈ మొక్కను ముట్టుకుంటే నాశనం తప్పదు.. ప్రపంచంలోనే డేంజరస్ ప్లాంట్
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
'నాకూ సరైన వ్యక్తి దొరుకుతాడు'.. హార్దిక్ మాజీ భార్య నటాషా
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
రూ.200 కోట్లా.. ఇంతకీ అవి డబ్బులేనా స్వామి ??
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
క్రికెటర్ డేవిడ్ వార్నర్‏తో మై డాక్టర్ భాగస్వామ్యం..
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
స్కూటర్‌ను ఢీకొట్టి..ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్..నిప్పులు చెరుగుతూ
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!
గాయని గ్లామర్ ట్రీట్..అందాలతో రచ్చచేస్తున్న స్టార్ సింగర్!