AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Post Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టాఫీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజుతో ముగుస్తున్న..

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగంలో దేశ వ్యాప్తంగా 38,926 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. పదో తరగతిలో..

India Post Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లో 2,942 పోస్టాఫీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజుతో ముగుస్తున్న..
India Post
Srilakshmi C
|

Updated on: Jun 05, 2022 | 2:38 PM

Share

India Post GDS Recruitment 2022: భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగంలో దేశ వ్యాప్తంగా 38,926 గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (Gramin Dak Sevak Posts) పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా పోస్టల్ విభాగం సూచిస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం క్లుప్తంగా మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 38,926

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (BPM) పోస్టులు
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ABPM) పోస్టులు
  • డాక్‌ సేవక్‌ పోస్టులు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయంటే..

  • తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు: 1226
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోస్టులు: 1716

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్:

  • బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000లవరకు జీతంగా చెల్లిస్తారు.
  • ఏబీపీఎం పోస్టులకు నెలకు రూ.10,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

ఎంపిక విధానం: టెన్త్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 5, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.