AP DSC Free Coaching: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో..

AP DSC Free Coaching: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి
AP DSC Free Coaching
Follow us

|

Updated on: Aug 26, 2024 | 4:09 PM

అమరావతి, ఆగస్టు 26: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో డీఎస్సీ నోటికేషన్‌ త్వరలో వెలువడనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు నిర్వహణలో 2024-25 విద్యా సంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్టు ఓ ప్రకటన వెలువరించింది. ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీ పడే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ శిక్షణ ఉంటుంది. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ కూడా అందజేస్తారు. ఇంటర్‌, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్‌ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అసక్తి కలిగిన వారు డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

కాగా రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి టెట్‌ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ పరీక్షకు, డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమవడానికి ఒక్కొక్క దానికి 3 నెలల చొప్పున వ్యవధి ఇచ్చింది. ఇప్పటికే టెట్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా త్వరలోనే హాల్‌ టికెట్లు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 (జులై) పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున దాదాపు 18 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం మొదటి సెషన్‌ 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండో సెషన్‌ 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 22 తర్వాత నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. అక్టోబర్‌ 4 నుంచి ప్రాథమిక ‘కీ’ అందుబాటులో ఉంచనున్నారు.

అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరిస్తారు. అక్టోబర్‌ 27వ తేదీ తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేస్తారు. నవంబర్‌ 2న టెట్‌ తుది ఫలితాలు ప్రకటిస్తారు. అంతా అనుకున్నట్ల జరిగితే అదే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే..
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
అలిగి వెళ్ళిపోయిన కృష్ణుడు గ్రామస్తులను మళ్ళీ ఎలా అనుగ్రహించాడంటే
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
సీనియర్‌తో జూనియర్ డ్యాన్స్.. కట్‌చేస్తే పడి పడి నవ్విన స్టూడెంట్
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
అయ్యయ్యో.. మంచు లక్ష్మీ ఇలా అయ్యిందేంటీ..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేస్తున్న తలైవా..
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అర్ధరాత్రి కారులో వస్తారు.. సైలెంట్‌గా పనికానిస్తారు.. చివరకు
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి.. ఏం జరిగిందంటే
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
తండ్రి పాడె మోసి అంత్యక్రియలు చేసిన జబర్దస్త్ తన్మయి.. వీడియో
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బలూచిస్తాన్‌లో దారుణ ఘటన.. 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కాళేశ్వరంప్రాజెక్టుకు భారీగావరద ఉధృతి..లక్ష్మీ బ్యారేజ్ పరిస్థితి
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!
కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో DNA రిపోర్టే కీలకం.!