AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ‘పది’ పరీక్షలు.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి (మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 30 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగియనుండగా.. మరో రెండు రోజులు (మార్చి 30 వరకు) ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది..

10th Class Exams 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ‘పది’ పరీక్షలు.. విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
10th Class Exams
Srilakshmi C
|

Updated on: Mar 18, 2024 | 6:46 AM

Share

అమరావతి, మార్చి 18: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి (మార్చి 18) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 30 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగియనుండగా.. మరో రెండు రోజులు (మార్చి 30 వరకు) ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలుంటాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. 2023-24 విద్యా సంవత్సారినికి గానూ మొత్తం 6,23,092 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది ఉత్తీర్ణుత సాధించలేక తిరిగి ప్రవేశం పొందినవారు 1,02,528 మంది, ఓరియంటల్‌ విద్యార్థులు 1,562 మంది వరకు ఉన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే సెంటర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా చేయవచ్చని విద్యాశాఖ ప్రకటించింది.

మార్చి 18 నుంచి మార్చి 30 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.45 గంటల నుంచి విద్యార్ధులను అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాల్లో మరో 30 నిమిషాల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు చీఫ్‌ సూపరింటెండెంట్లు 3,473 మంది, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు 3,473 మంది, ఇన్విజిలేటర్లు 35,119 మందిని నియమించారు. అలాగే 156 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్, 682 సిట్టింగ్‌ స్వాడ్స్‌ను కూడా నియమించారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలతోపాటు అదనంగా సిట్టింగ్‌ స్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇన్విజిలేటర్లు, విద్యాశాఖ అధికారులు, పోలీసులు, నాన్‌–టీచింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, చీఫ్‌ ఇన్విజిలేటర్లు.. ఎవరైనా సరే సెల్‌ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి రావడాన్ని పూర్తిగా నిషేధించామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పదో తగరతి పరీక్ష పేపర్లపైనా, ప్రతి ప్రశ్నకు ‘క్యూఆర్‌’ కోడ్‌ను ముద్రించారు. దీంతో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినా, పేపర్‌ లీక్‌ చేసినా ఏ సెంటర్‌లో ఏ విద్యార్థి పేపర్‌ లీక్‌ అయిందో క్షణాల్లో తెలిసిపోతుంది. పది పరీక్షలు పూర్తయ్యాక మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు వ్యాల్యూయేషన్‌ ఉంటుంది. ఆ తర్వాత వెనువెంటనే ఫలితాలను కూడా వెల్లడించే విధంగా పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అటు తెలంగాణలోనూ నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి ఏప్రిల్‌ 2 వరకూ జరిగే పరీక్షలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఆలస్యంగా వచ్చిన విద్యార్ధులకు మరో ఐదు నిమిషాల పాటు అంటే 9.35 నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.

ఇవి కూడా చదవండి

తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.