AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2022: ఏపీ ఎంసెట్‌ 2022 ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ ఎప్పుడు విడుదల చేస్తారంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు జులై 4 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌, అగ్రికల్టర్ విభాగాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్‌ ప్రాథమిర ఆన్సర్‌ 'కీ'..

AP EAPCET 2022: ఏపీ ఎంసెట్‌ 2022 ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' ఎప్పుడు విడుదల చేస్తారంటే..
Ap Eamcet 2022
Srilakshmi C
|

Updated on: Jul 08, 2022 | 8:14 AM

Share

AP EAPCET 2022 Answer Key: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు జులై 4 నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌, అగ్రికల్టర్ విభాగాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్‌ ప్రాథమిర ఆన్సర్‌ ‘కీ’ జులై 12న విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి (APSCHE) ప్రకటించింది. ఆన్సర్ కీతో పాటు రెస్పెన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/లో అందుబాటులో ఉంటాయని తెల్పింది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు సంబంధించి జులై 12 సాయంత్రం 5 గంటల నుంచి, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌కు సంబంధించి జులై 13 ఉదయం 9 గంటల నుంచి వెబ్‌సైట్‌లో ఇవి అందుబాటులో ఉంచుతామని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. సమాదాన పత్రాలపై అభ్యంతరాలను లేవనెత్తేవారు జులై 14న (ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌), జులై 15 (అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌) వరకు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెల్పింది.

కాగా ఏపీ ఈఏపీసెట్‌ 2022 ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష మొత్తం 5 రోజుల్లో.. జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో జరుగుతాయి. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరుగుతాయి. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది. ఈ పరిక్షలకు సంబంధించిన క్వశ్యన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.