AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ జమ అయ్యేది అప్పుడే..

దీపావళి వచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు వెలుగులు నింపింది. ఈపీఎఫ్ ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ తమ ఖాతాదారులకు దీపావళి కానుకగా వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ ఖాతాల్లో నిలువ ఉన్న పెట్టుబడిపై 8.15శాతం వడ్డీని డిపాజిట్ చేసింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు వచ్చి చేరింది. మరి కొందరికి జమ అవ్వడానికి కొంత సమయం

EPFO: దీపావళికి ముందే ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ జమ అయ్యేది అప్పుడే..
Union Labor Minister Says Interest Has Credit To The Epf Account Holder's
Srikar T
|

Updated on: Nov 10, 2023 | 4:34 PM

Share

దీపావళి వచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు వెలుగులు నింపింది. ఈపీఎఫ్ ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము జమ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ తమ ఖాతాదారులకు దీపావళి కానుకగా వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ పీఎఫ్ ఖాతాల్లో నిలువ ఉన్న పెట్టుబడిపై 8.15శాతం వడ్డీని డిపాజిట్ చేసింది. ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ డబ్బులు వచ్చి చేరింది. మరి కొందరికి జమ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు అధికారులు.

ఈపీఎఫ్ చెప్పిన దాని ప్రకారం.. తమ వినియోగదారుల ఖాతాల్లో వడ్డీని డిపాజిట్ చేసేందుకు ఒక ప్రక్రియను అవలంభిస్తుంది. తద్వారా నిలువ ఉన్న సొమ్ముపై పూర్తి వడ్డీని చెల్లించేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించింది. అందుకే ఉద్యోగులు ఓపిక పట్టాలని ఈపీఎఫ్‌వో ఖాతాదారులను కోరింది. ప్రస్తుతం వడ్డీలో ఎలాంటి తగ్గింపు ఉండదని పేర్కొంది. 24 కోట్ల ఖాతాల్లో వడ్డీ జమ అయినట్లు తెలిపింది. వడ్డీని క్రెడిట్ చేసిన తర్వాత పీఎఫ్ ఖాతాదారుడి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కి మెసేజ్ వస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

ఒకవేళ మెసేజ్ రాకపోతే యూపీఎఫ్ సంస్థకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా తమ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దీంతో పాటూ ఉమంగ్ యాప్, ఈపీఎఫ్ఓ​వెబ్‌సైట్ ద్వారా కూడా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోని బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించి ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పీఎఫ్ వడ్డీ రేటును నిర్ణయిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేటును ప్రకటించినట్లు వివరించారు. గత సంవత్సరం ఈపీఎఫ్‌వో​తన చందాదారులకు వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయి తగ్గించినట్లు తెలిపింది. 2020-21లో 8.10% నుంచి 8.5% శాతానికి తగ్గించింది. 1977-78లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు