AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అత్యంత ధనవంతుడుగా రికార్డుల్లోకి కెక్కారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్రవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్‌లో భాగంగా ఆయ‌న త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు.

Telangana Election: అత్యంత ధనిక ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. రాజగోపాల్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Komatireddy Rajgopal Reddy, Pailla Shekar Reddy
Balaraju Goud
|

Updated on: Nov 10, 2023 | 1:25 PM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రూ. 458 కోట్ల ఆస్తులతో అత్యంత ధనవంతుడుగా రికార్డుల్లోకి కెక్కారు. మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్రవారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. నామినేష‌న్‌లో భాగంగా ఆయ‌న త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్రకారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.458.37 కోట్లుగా తేలింది.

రాజగోపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల్లో రూ.297.36 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వీటిలో చేతిలో నగదు, బ్యాంకు డిపాజిట్లు, సుషీ ఇన్‌ఫ్రా & మైనింగ్ లిమిటెడ్‌లో రూ.239.31 కోట్ల విలువ కలిగిన షేర్లు ఉన్నాయి. ఆయన భార్య కె.లక్ష్మికి రూ.4.18 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రాజ్‌గోపాల్‌రెడ్డికి రూ.108.23 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ఆయన భార్యకు రూ.48.60 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు ఉన్నాయి.

ఇక అతని పేరుతో మొత్తం అప్పులు రూ.4.14 కోట్లు. అఫిడవిట్ ప్రకారం, 2022 23లో అతని ఆదాయం రూ. 71.17 కోట్లు, 2021 22లో రూ. 1.52 కోట్లుగా ఉంది. రాజ్‌గోపాల్ రెడ్డి అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి కాలరీస్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ , ఇతర రాష్ట్రాల నుండి సుషీ ఇన్‌ఫ్రా, మైనింగ్ లిమిటెడ్ పేరుతో పొందిన 16 కాంట్రాక్టుల వివరాలను కూడా సమర్పించారు.

2018లో మునుగోడు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు రూ. 314 కోట్ల ఆస్తులను ప్రకటించినప్పటి నుంచి ఆయన నికర విలువ 45 శాతానికి పైగా పెరిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో రూ. 66 కోట్ల ఆస్తులు ప్రకటించారు.

2009 నుండి 2014 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్న రాజ్‌గోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ముంగోడు నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, అసెంబ్లీకి రాజీనామా చేసి, గత సంవత్సరం బీజేపీలో చేరారు. అయితే గతేడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడైన రాజ్‌గోపాల్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం మళ్లీ కాంగ్రెస్‌లో చేరి మునుగోడుకు టికెట్‌ దక్కించుకున్నారు.

ఇదిలావుంటే, అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (BRS)కు చెందిన పైళ్ల శేఖర్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడిగా రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరిగి బరిలోకి దిగిన ఆయన ఆస్తులు విలువ రూ.227 కోట్లు. శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మరోక BRS ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ MP దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి K. ప్రభాకర్ రెడ్డితో భాగస్వాములుగా ఉన్నారు.

ఇక దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రెడ్డి ఆస్తులు రూ.197 కోట్లు. ఇటీవల కత్తిపోట్లతో కోలుకున్న ఆయన గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు వీల్ చైర్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఆయనకు రూ.7.24 కోట్ల చరాస్తులు ఉండగా, ఆయన భార్య మంజులతకు రూ.9.41 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డికి రూ.84.63 కోట్ల స్థిరాస్తులు ఉండగా, ఆయన భార్య విలువ రూ.96 కోట్లు. 2022 23లో, అతని ఆదాయం రూ. 2.91 కోట్లు కాగా, అంతకుముందు సంవత్సరంలో ఇది రూ. 3.16 కోట్లు. ఈ జంట మొత్తం రూ.12.79 కోట్ల రుణాలను కలిగి ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్న జనార్దన్‌రెడ్డి తన ఆస్తులు రూ.112 కోట్లుగా ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..