Silver Price Today: దేశీయంగా వెండి ధరలు పెరిగితే.. హైదరాబాద్లో తగ్గింది.. ఎంతంటే..
Silver Price Today: దేశీయంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర పెరుగుతోంది. అయితే హైదరాబాద్తోపాటు మరి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది..

Silver Price Today: దేశీయంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధర పెరుగుతోంది. అయితే హైదరాబాద్తోపాటు మరి కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టింది. కొన్ని ప్రాంతాల్లో పరుగులు పెట్టింది. అయితే భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. తాజాగా శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయానికి దేశీయంగా కిలో వెండిపై రూ.500 వరకు తగ్గితే.. హైదరాబాద్తో పాటు ఇతర దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,500 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, కోల్కతాలో రూ.63,500 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,500 ఉండగా, కేరళలో రూ.68,400 ఉంది. ఇక అహ్మదాబాద్లో కిలో వెండి రూ.63,500 ఉండగా, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.68,400 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,400 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
కాగా, ప్రతి రోజు మార్పులు చోటు చేసుకునే బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.