Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం, వెండి ధరలు

Silver Price Today: పతనమవుతున్న వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన సిల్వర్ రేట్లు..
Silver Rate Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 09, 2021 | 6:46 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో స్వల్పంగా పెరుగుతున్న వెండి ధరలకు గురువారం కూడా బ్రేక్ పడింది. తాజాగా వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కిలో వెండి ధర రూ.64,800లుగా ఉంది. మళ్లీ రూ.200 మేర ధర తగ్గింది. కాగా.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి కిలో ధర గురువారం రూ.500మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 64,800 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,100గా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,800 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,100 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 69,100 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 69,100 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోండి..!

Indian Railways: ఆలస్యంగా చేరుకున్న రైలు.. రూ.30వేల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం