RTGS: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. నేడు 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..?

Real-Time Gross Settlement: కరోనావైరస్ ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో..

RTGS: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. నేడు 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలు నిలిపివేత.. ఎందుకంటే..?
RTGS Services
Follow us

|

Updated on: Apr 18, 2021 | 6:48 AM

Real-Time Gross Settlement: కరోనావైరస్ ప్రారంభమైన నాటినుంచి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం మేర పెరిగినట్టు పలువురు చెబుతున్నారు. జనం ఈ విధానానికే క్రమంగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలను 14 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి.

శనివారం సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత అర్థరాత్రి 12గంటల నుంచి ఆర్టీజీఎస్ సేవలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 2 వరకు ఈ సేవలకు అంతరాయం ఏర్పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుపుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ సిస్టంను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటలపాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అయితే.. ఆర్‌టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. ఈ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని, ఆర్‌టీజీఎస్ సేవలకు మాత్రమే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవాలని సూచించింది.

పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలని సూచించింది. అయితే.. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి, లావాదేవీలు జరిపేందుకు ఆర్‌టీజీఎస్ సేవలు ఉపయోగపడతాయి. అయితే నెఫ్ట్ కు మాత్రం ఇలాంటి పరిమితులు లేవు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు బ్యాంకుల వేళల్లో మాత్రమే పరిమితంగా ఉండేవి. దేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి.

Also Read:

Covid-19 Vaccination: నేడు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ నిలిపివేత.. నిల్వలు లేకపోవడంతోనే..!

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు