AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అక్రమాలు పెరిగాయి. దాదాపు 33 నుంచి 54 లక్షల మంది అనర్హులు పథకం లబ్ధి

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!
Pm Kisan
uppula Raju
|

Updated on: Apr 28, 2022 | 7:38 AM

Share

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అక్రమాలు పెరిగాయి. దాదాపు 33 నుంచి 54 లక్షల మంది అనర్హులు పథకం లబ్ధి పొందుతున్నట్లు తేలింది. దాదాపు రూ.43 వందల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అర్హులైన రైతులెవరూ నష్టపోకూడదని అలాగే అనర్హులు ఎవరూ డబ్బులు పొందకూడదని చర్యలు ప్రారంభించింది. ఎవరైనా అక్రమంగా డబ్బు తీసుకున్నట్లయితే వాటిని తిరిగి చెల్లించాలని సూచించింది. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)ని సందర్శించి కుడి వైపున ఉన్న వాపసు ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా ఈ పథకం ద్వారా అందుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అలాగే తప్పుగా తీసుకున్న డబ్బును వాపసు చేయడానికి మరొక ఎంపిక కూడా ఉంది. మీరు జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించడం ద్వారా కూడా డబ్బును తిరిగి చెల్లించవచ్చు. దీని కోసం మీరు (bharatkosh.gov.in) సహాయం తీసుకోవచ్చు.

డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది?

డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తమిళనాడు తరహాలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో సుమారు రెండు వందల కోట్ల రూపాయలను అక్రమంగా వెనక్కి తీసుకున్నారు. 123 మందిని అరెస్టు చేశారు. పిఎం కిసాన్ సొమ్మును అనర్హుల ఖాతాల్లోకి బదిలీ చేస్తే వాటిని ఎలా వెనక్కి తీసుకోవాలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. PM కిసాన్ యోజనలో మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు 65000 కోట్ల రూపాయలు అందిస్తుంది. పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని తెలిసినప్పటి నుంచి ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. ఆధార్‌ను తప్పనిసరి చేశారు. E-KYC తప్పనిసరి అయింది. అలాగే అర్హతను నిర్ధారించడానికి 5 నుంచి 10 శాతం మంది రైతుల భౌతిక ధృవీకరణ తప్పనిసరి చేశారు. తప్పుడు డబ్బు తీసుకున్న వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులేనని తేలింది. ఫిజికల్ వెరిఫికేషన్‌లో కూడా 2 లక్షలకు పైగా అనర్హులని గుర్తించారు.

ఏ రాష్ట్రాల్లో ఎక్కువ అనర్హులు

పిఎం కిసాన్ పథకంలో అత్యధికంగా 13,38,563 మంది అనర్హులైన రైతులు అస్సాంలో ఉన్నారు. ఈ విషయంలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 7,61,465 మంది ఈ పథకాన్ని తప్పుడు మార్గంలో సద్వినియోగం చేసుకున్నారు. పంజాబ్‌లో 6,22,362 మంది రైతులు అనర్హులు. 4,88,593 మంది రైతులతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉండగా, 3,32,786 మందితో ఉత్తరప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి గమనిక.. ఇవి చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు..!

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!

IPL 2022: ఒక్క మ్యాచ్‌ ఆడి ‘సూపర్ మ్యాన్’ అయ్యాడు.. ఎవరో తెలుసా..?