AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. బ్యాంకు అకౌంట్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!

PM Kisan: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఉపశమనం కలిగించే వార్త ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పథకం 20వ విడత తేదీని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే..

PM Kisan: రైతులకు శుభవార్త.. బ్యాంకు అకౌంట్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!
భారత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మొత్తం 21 వాయిదాలను విడుదల చేసింది. అది కూడా మూడు రాష్ట్రాలకు మాత్రమే. మిగితా రాష్ట్రాలకు రావాల్సి ఉంటుంది. అయితే, 21వ విడత పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరద బాధిత 2.7 మిలియన్ల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. ఇంతలో దేశవ్యాప్తంగా రైతులు తమ 21వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం 21వ విడతను ఎప్పుడు విడుదల చేస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
Subhash Goud
|

Updated on: Aug 02, 2025 | 9:09 AM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ పథకం) 20వ విడతను నేడు శనివారం (ఆగస్టు 2) విడుదల చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ 20వ విడతను విడుదల చేయనున్నారు. మొత్తం రూ. 20,500 9.7 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు విడుదల అవుతాయి.. ప్రతి రైతు తన ఖాతాలో రూ. 2,000 పొందుతారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ లక్ష దాటనున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ డబ్బును విడుదల చేస్తారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ప్రసంగాన్ని వినేందుకు ఏర్పాట్లు చేశారు. 2019లో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ. 6,000 అందిస్తుంది. ఈ డబ్బును సంవత్సరంలో మూడు విడతలుగా అందజేస్తారు. ఇప్పటివరకు ప్రభుత్వం 19 విడతలుగా విడుదల చేసింది. మొత్తం రూ. 3.69 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో 10 లక్షలకు పైగా నమోదిత రైతులు ఉన్నారు. వీరిలో e-KYC చేయని వారికి డబ్బు అందదు. ఈ పథకంలో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందని నిర్ధారించుకోవచ్చు. ఈ జాబితాను ప్రధానమంత్రి కిసాన్ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

  • PM కిసాన్ వెబ్‌సైట్ చిరునామా: pmkisan.gov.in/homenew.aspx
  • ప్రధాన పేజీలో కొంచెం క్రిందికి స్క్రోల్ చేస్తే, మీకు రైతు కార్నర్ కనిపిస్తుంది. ఆ బాక్స్‌లో లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, తాలూకా, గ్రామాన్ని ఎంచుకుని, Fetch Data నొక్కండి.
  • మీరు ఎంచుకున్న గ్రామంలో PM కిసాన్ పథకం కోసం నమోదు చేసుకున్న వారందరి పేర్ల జాబితాను ఇక్కడ మీరు చూస్తారు.

జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ బ్యాంకు ఖాతాకు డబ్బు జమ కాకపోయే అవకాశం ఉంది. ఇలా జరిగితే eKYC చేయకపోవడం బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయకపోవడం మొదలైనవి కారణం కావచ్చు. మీరు మీ సమీపంలోని రైతు సంప్రదింపు కేంద్రానికి వెళ్లి విచారించవచ్చు.

ఇది కూడా చదవండి: Traffic Rules: కారు అతి వేగంగా నడిపినందుకు రూ. కోటి జరిమానా.. ఇక్కడ ఆదాయాన్ని బట్టి చలాన్‌!

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి