AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ పథకంలో గతంలో డబ్బు అందని వారికి మళ్ళీ జమ చేశారు..మీరూ ఒకసారి చెక్ చేసుకోండి!

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన, పిఎమ్ కిసాన్ స్కీమ్‌గా ప్రసిద్ధి చెందింది.

PM Kisan: పీఎం కిసాన్ పథకంలో గతంలో డబ్బు అందని వారికి మళ్ళీ జమ చేశారు..మీరూ ఒకసారి చెక్ చేసుకోండి!
Pm Kisan
KVD Varma
|

Updated on: Aug 16, 2021 | 6:57 PM

Share

PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన, పిఎమ్ కిసాన్ స్కీమ్‌గా ప్రసిద్ధి చెందింది. దీని కింద రెండు హెక్టార్ల వరకు భూమి ఉన్న రైతులకు మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి 6,000 రూపాయలు  ఇస్తారు. అయితే ఈ పధకం ద్వారా లబ్ధిదారులకు సొమ్ములను నేరుగా వారి బ్యాంక్ ఎకౌంట్లకు జమ చేస్తారు. తాజాగా ప్రధాని మోడీ ఈ పథకం కింద 9వ విడత నిధులను విడుదల చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు తమ ఖాతాల ద్వారా ఈ సొమ్మును అందుకున్నారు. అయితే, కొంతమంది రైతులకు ఈ సొమ్ములు అందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్యాంక్ లావాదేవీల్లో అవాంతరాల కారణంగా కొందరు రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందలేదు. ఇలా ఇబ్బందులు తలెత్తిన ఎకౌంట్లను పరిశీలించి మళ్ళీ వారి ఖాతాలకు డబ్బులు జమ అయ్యేలా రీ ప్రాసెస్ చేశారు. ఇప్పటికీ డబ్బులు అందని అర్హత కలిగిన లబ్ధిదారుల్లో చాలామందికి ఈ విధానంలో మళ్ళీ డబ్బులు జమ అయ్యాయి. వాటిలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోవచ్చు.

ఇక, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా ఇస్తున్న ఈ డబ్బు కొన్ని ఖాతాల్లో జమ కావడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లావాదేవీలు ఫిబ్రవరి 1, 2019 నుంచి జూన్ 30, 2021 మధ్యలో మొత్తం 61,04,877 విఫలం అయ్యాయి. అంటే అంతమంది లబ్ధిదారులకు ఈ సొమ్ములు అందలేదు. అయితే, వీటిని తిరిగి ప్రాసెస్ చేశారు. ఈ క్రమంలో కేవలం 34 శాతం లావాదేవీలు మాత్రమే విజయవంతంగా ప్రాసెస్ అయి లబ్ధిదారులకు చేరాయి.

ఈ పథకం కింద, ఇవ్వవలసిన  మొత్తం చిన్న, సన్నకారు రైతులకు ప్రతి నాలుగు నెలల తర్వాత ఒక్కొక్కరికి 2,000 రూపాయల  చొప్పున మూడు సమాన వాయిదాలలో ఇస్తారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు ఫిబ్రవరి 2019 (ఈ పథకం ప్రారంభించినప్పుడు, ఆ సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన తర్వాత)  జూన్ 2021 మధ్య విఫలమైన లావాదేవీల శాతం ఒక శాతం కంటే తక్కువ లేదా 61,04,877 ఉన్నట్లు చెప్పారు.  ఆ కాలంలో ప్రధానమంత్రి  కిసాన్ పథకం కింద జరిగిన మొత్తం లావాదేవీలు 68,76,55,195.

ఏది ఏమయినప్పటికీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సొంత గణాంకాల ప్రకారం..ఆ 61,04,877 విఫలమైన లావాదేవీలలో కేవలం 20,88,010 లావాదేవీలు లేదా వాటిలో కేవలం 34 శాతం మాత్రమే రైతులకు విజయవంతంగా తిరిగి ప్రాసెస్ అయ్యాయి. మిగిలినవి ప్రాసెస్ కాలేదు. అంటే ఆమేరకు లబ్ధిదారులకు ఆ సొమ్ములు చేరలేదనే అర్ధం.

అలాగే, చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు.దీనితో 10 వ వ్యవసాయ జనాభా గణన 2015-16  తాత్కాలిక లెక్కల ప్రకారం, ఉత్తర ప్రదేశ్, బీహార్ రెండు రాష్ట్రాలకు అత్యధిక లబ్ది చేకూరింది. అంటే ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు.

ఈ విషయంలో, వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ప్రధానమంత్రి కిసాన్ పథకం కాలంలో ఉత్తర ప్రదేశ్‌కు సంబంధించి 10,95,225 లావాదేవీలు విఫలం అయ్యాయి. కేవలం 8 శాతం లేదా 91,908 లావాదేవీలు మాత్రమే లబ్ధిదారులకు తిరిగి ప్రాసెస్ అయ్యాయి.

Also Read: Online Sale: అమెజాన్..ఫ్లిప్ కార్ట్..పేటీఎంల ద్వారా ఈజీగా మీ వస్తువులు అమ్ముకోవచ్చు..ఎలాగంటే..

PM Modi: స్వయం సహాయక సంఘాలకు ప్రధాని మోదీ శుభవార్త.. మహిళలకు మద్దతుగా ఈ-కామర్స్‌ వేదికలు