Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఆపరేటర్లకు రూ.2100 కోట్ల నష్టం.. ఎందుకంటే..

Petrol-Diesel Price Today: వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. చివరిసారిగా ఏప్రిల్‌ 6న పెరిగిన ధరలు.. అప్పటి నుంచి బ్రేకులు పడ్డాయి. నేటికీ ధరలో ఎలాంటి.

Petrol Diesel Price Today: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఆపరేటర్లకు రూ.2100 కోట్ల నష్టం.. ఎందుకంటే..

Updated on: May 29, 2022 | 7:10 AM

Petrol-Diesel Price Today: వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. చివరిసారిగా ఏప్రిల్‌ 6న పెరిగిన ధరలు.. అప్పటి నుంచి బ్రేకులు పడ్డాయి. నేటికీ ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర ప్రస్తుతం 115 డాలర్ల స్థాయిలో ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ధరలో మార్పు వచ్చింది. అప్పటి నుండి ఈ రోజు వరుసగా ఎనిమిదో రోజు ధర స్థిరంగా ఉంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత మే 22న దేశవ్యాప్తంగా చమురు ధరలు లీటరుకు రూ.7 నుండి రూ.9.5 వరకు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం తర్వాత, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్‌ని తగ్గించాయి. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు పెట్రోల్‌,డీజిల్‌ ధరలపై ఉపశమనం లభించింది.

ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.96.72 ఉండగా, డీజిల్ రూ.89.62కు చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 కాగా, డీజిల్ ధర రూ.97.28గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82గా ఉంది. మీరు మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తెలుసుకోవాలనుకుంటే, ఈ లింక్‌పై క్లిక్ చేయండి .

పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు 2100 కోట్ల నష్టం

ఇవి కూడా చదవండి

ఇక్కడ, ఎక్సైజ్ సుంకాన్ని అకస్మాత్తుగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ పంప్ నిర్వాహకులు రూ.2100 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఈ నష్టానికి పరిహారం చెల్లించాలని పెట్రోల్‌ పంప్‌ నిర్వాహకులు డిమాండ్‌ చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ను ఖరీదైన ధరలకు నిల్వ చేశామని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ AIPDA తెలిపింది. దీని కారణంగా పెట్రోల్ పంప్ ఆపరేటర్లందరూ ఆ స్టాక్‌పై లక్షల్లో నష్టపోయారు.

పెట్రోల్ పై పన్ను ఎలా విభజించబడింది?

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.57.13 కాగా, ఛార్జీ రూ.0.20. ఈ విధంగా, డీలర్లకు ఛార్జీ రూ. 57.33 అవుతుంది. ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని రూ.19.90కి, వ్యాట్ రూ.15.71కి తగ్గించారు. డీలర్ కమీషన్ రూ.3.78. దీన్ని పెంచాలన్న డిమాండ్ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us