AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC – Adani: అదానీ షేర్ల పతనం ప్రభావం.. 50 రోజుల్లో రూ.50 వేల కోట్లు కోల్పోయిన ఎల్‌ఐసీ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటి. ఎల్‌ఐసీ భారత మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు. కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి భారీ..

LIC - Adani: అదానీ షేర్ల పతనం ప్రభావం.. 50 రోజుల్లో రూ.50 వేల కోట్లు కోల్పోయిన ఎల్‌ఐసీ
Lic
Subhash Goud
|

Updated on: Feb 24, 2023 | 4:48 PM

Share

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన పెట్టుబడిదారులలో ఒకటి. ఎల్‌ఐసీ భారత మార్కెట్లో అతిపెద్ద దేశీయ సంస్థాగత పెట్టుబడిదారు. కంపెనీ స్టాక్ మార్కెట్ నుండి భారీ లాభాలను ఆర్జించింది. దాని వాటాదారులు, పాలసీదారులకు విలువను సృష్టిస్తోంది. స్టాక్ మార్కెట్‌లోని ఇతర కంపెనీల మాదిరిగానే ఎల్‌ఐసి కూడా అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ కారణంగా ఎల్‌ఐసీ చాలా నష్టపోయింది. ఎందుకంటే అదానీ గ్రూప్ షేర్లు గత నెల నుండి భారీ అమ్మకాలు జరిగాయి. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్ గురించి వివాదాస్పద నివేదికను విడుదల చేసినప్పటి నుండి గ్రూప్ అన్ని షేర్లు దాదాపు ప్రతిరోజూ పడిపోతున్నాయి. దీని వల్ల ఎల్‌ఐసీకి గత 50 రోజుల్లోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

స్టాక్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఎల్‌ఐసి ఏడు అదానీ గ్రూప్ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అంబుజా సిమెంట్స్, ఎసిసిలను కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్‌లోని ఈ ఏడు షేర్లలో ఎల్‌ఐసి పెట్టుబడి విలువ 31 డిసెంబర్ 2022 నాటికి రూ. 82,970 కోట్లు. ఈ విలువ 23 ఫిబ్రవరి 2023 నాటికి రూ.33,242 కోట్లకు తగ్గింది. ఇలా గత 50 రోజుల్లో అదానీ షేర్లలో ఎల్‌ఐసీ పెట్టుబడి విలువ రూ.49,728 కోట్లు తగ్గింది.

హిండెన్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్‌పై చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. జనవరి 24, 2023న వచ్చిన నివేదికలో, గ్రూప్ అకౌంటింగ్‌లో మోసం చేసిందని, షేర్ ధరలను తారుమారు చేసిందని ఆరోపించారు. అయితే హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అదానీ గ్రూప్ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

అదానీ షేర్లు భారీగా పడిపోయాయి:

అదానీ గ్రూప్ షేర్లు మాత్రం క్షీణిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం గురించి చెప్పాలంటే ఇప్పటివరకు అదానీ టోటల్ గ్యాస్ షేర్లు దాదాపు 80 శాతం పడిపోయాయి. దీని తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ సుమారు 74 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 71 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 64 శాతం, అదానీ పవర్ 48 శాతం, ఎన్‌డిటివి 42 శాతం క్షీణించాయి. వీటితో పాటు అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఏసీసీ షేర్లు 28 శాతం నుంచి 40 శాతానికి పడిపోయాయి. మొత్తంమీద, ఈ ఏడాది ఇప్పటివరకు అదానీ గ్రూప్ ఎమ్‌కాప్ రూ.12 లక్షల కోట్లకు పైగా క్షీణించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us