ఈజిప్టు పిరమిడ్లలో తమిళ వ్యాపారి పేరు!
పురాతన తమిళ వ్యాపారులు 2 వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టుకి ప్రయాణించారని నిర్ధారించే కీలక ఆధారాలు దొరికాయి. ఈజిప్టులోని రాజ సమాధుల్లో 2 వేల సంవత్సరాల నాటి తమిళ-బ్రహ్మీ శాసనాలు, ఐదు వేర్వేరు పిరమిడ్లలో ‘సిగై కొట్రాన్’ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు ఎనిమిది సార్లు చెక్కి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ శాసనాలు ప్రాచీన కాలంలో ప్రపంచ వాణిజ్య పటంలో తమిళులు ప్రధాన పాత్ర పోషించినట్టు రుజువు చేస్తున్నాయని తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరసు అన్నారు. ఈజిప్టు పిరమిడ్లలో తమిళ వ్యాపారి పేరు ఉండటం గర్వకారణమనీ, అధ్యయనంలో ఈజిప్టు పిరమిడ్లలో 2000 ఏళ్ల నాటి శిలాశాసనాలు గుర్తించారని తెలిపారు.
వాటిలో కొన్నింటిలో తమిళ వ్యాపారి పేరును గుర్తించారని దీన్నిబట్టి వేల సంవత్సరాల క్రితమే తమిళులు సముద్రాలు దాటి వ్యాపారం చేశారనే విషయం తెలుస్తుందన్నారు. ప్రపంచ వాణిజ్యంలో తమిళులు ఎంతగా తమదైన ముద్ర వేశారో ఈ ఉదాహరణ చాలన్నారు.చెన్నైలో తమిళ ఎపిగ్రఫీపై బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల సదస్సులో స్విట్జర్లాండ్లోని లౌసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్ట్రౌచ్ పాల్గొన్నారు. అక్కడి పిరమిడ్లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం :
వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్కు తాళాలు వేసే భక్తులు
భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

