Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: కిలో రూ. 3వేలు..ఈ దేశీ నెయ్యికి మార్కెట్లో మంచి డిమాండ్.. వెన్న తీయడం నుంచి మొదలు అంతా స్పెషల్..

ఆవు లేదా గేదె పాలతో చేసిన పాల ఉత్పత్తి ఒక రూపం. మార్కెట్‌లో రకరకాల నెయ్యి అందుబాటులో ఉన్నాయి. కానీ బిలోనా నెయ్యి అత్యుత్తమ నాణ్యతగా పరిగణించబడుతుంది. కారణం దానిని తయారు చేసే ప్రక్రియలో ఉంది. మార్కెట్‌లో లభించే ఇతర రకాల నెయ్యి కంటే..

Business Idea: కిలో రూ. 3వేలు..ఈ దేశీ నెయ్యికి మార్కెట్లో మంచి డిమాండ్.. వెన్న తీయడం నుంచి మొదలు అంతా స్పెషల్..
Ghee
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2023 | 1:35 PM

భారతదేశంలోని ప్రతి ఇంట్లో నెయ్యి ఒక ముఖ్యమైన పదార్ధం. ఇది ఆవు లేదా గేదె పాలతో చేసిన పాల ఉత్పత్తి ఒక రూపం. మార్కెట్‌లో రకరకాల నెయ్యి అందుబాటులో ఉన్నాయి. కానీ బిలోనా నెయ్యి అత్యుత్తమ నాణ్యతగా పరిగణించబడుతుంది. కారణం దానిని తయారు చేసే ప్రక్రియలో ఉంది. మార్కెట్‌లో లభించే ఇతర రకాల నెయ్యి కంటే ఇది చాలా ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి, ఇవాళ మనం సాధారణ నెయ్యి, బిలోనా నెయ్యి మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

బిలోనా నెయ్యి దేశీయ ఆవు పాలతో తయారు చేయబడింది. ఈ జాతి ఆవును A2 అని పిలుస్తారు. ఈ నెయ్యిని తరచుగా A2 నెయ్యి అని పిలుస్తారు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఉంది. ఈ నెయ్యి యంత్రాల సహాయంతో తయారు చేయబడదు. ఇందుకు బదులుగా బిలోనా అనే సాంప్రదాయిక పరికరం సహాయంతో స్థిరమైన మథనం ద్వారా తయారు చేయబడుతుంది. అందువలన, ఈ నెయ్యి నాణ్యతలో స్వచ్ఛమైనదిగా ప్రసిద్ధి చెందింది.

బిలోనా నెయ్యి ఎలా తయారు చేస్తారు?

ఈ నెయ్యిని తయారుచేయడం ప్రారంభించడానికి మొదటి దశ పెరుగు సిద్ధం చేయడం. పెరుగు A2 ఆవు పాలతో తయారు చేయబడింది. ఈ ఆవు పాల నుంచి తయారు చేసిన పెరుగును ఒక కుండలోకి తీసుకుని.. బిలోనా సహాయంతో చిలుకుతారు. పెరుగు నుండి వెన్న వచ్చే వరకు చిలుకుతారు.. ఇది సమయం తీసుకునే ప్రక్రియ. వెన్న విడిపోయిన తర్వాత.. అది మరొక కుండలోకి  మార్చుతారు. కట్టెల పొయ్యిపై గంటలపాటు వెన్నను ఉంచుతారు. చివరకు నెయ్యి రెడీ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 గంటల వరకు పడుతుంది. అందుకే ఇది మార్కెట్లో ఖరీదైనదిగా విక్రయించబడుతుంది. 1 కిలో బిలోనా నెయ్యి ధర రూ.3,000 వరకు పలుకుతోంది.

ఈ వ్యాపారం ద్వారా ఎంత ఆదాయం వస్తుందంటే

ముంబైకి చెందిన ఓ యువతి కోవిడ్-19 మహమ్మారి సమయంలో బిలోనా నెయ్యి వ్యాపారాన్ని ప్రారంభించారు. సెటప్‌ను సిద్ధం చేయడానికి రూ. 8 లక్షలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ప్రతి సంవత్సరం రూ.20 లక్షలు సంపాదిస్తోంది. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు 50% వరకు లాభం పొందవచ్చు. ఈ వ్యాపారాన్ని నగరాల్లో కాకుండా గ్రామాల్లో సులభంగా ప్రారంభించవచ్చు. గ్రామాల్లో, దేశవాళీ ఆవుల జాతిని మనం సులభంగా గుర్తించవచ్చు.. వాటిని పెంచేందుకు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. అయితే నగరాల్లో ఇది చాలా కష్టమైన పని.

ఈ నెయ్యికి చాలా సువాసన ఉంటుంది. నెయ్యి కూడా బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం