AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం ఎప్పుడంటే..

మొత్తం ప్రయాణ దూరం 272 కి.మీటర్లు ఉండే ఈ మార్గం ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాంతాలకు లాభం చేకూర్చనుంది.అత్యాధునిక సదుపాయాలతో కూడిన వందే భారత్ రైలు హిమాలయ ప్రాంతంలో ప్రయాణించబోతుండటం అరుదైన ఘట్టం. ఈ రైలు కాట్రా-శ్రీనగర్ దూరాన్ని కేవలం మూడు గంటల్లోనే చేరుకుంటుంది.

Watch: జమ్మూకశ్మీర్‌లో వందే భారత్ రైలు ట్రయల్ రన్ ..ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
Katra To Srinagar Vande bharat
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2025 | 3:54 PM

జమ్మూకశ్మీర్‌లో కొత్తగా నిర్మించిన కత్రా-సంగల్ప్ రైల్ ట్రాక్‌పై వందే భారత్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ఏప్రిల్ 19న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. మొత్తం ప్రయాణ దూరం 272 కి.మీటర్లు ఉండే ఈ మార్గం ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా ప్రాంతాలకు లాభం చేకూర్చనుంది.అత్యాధునిక సదుపాయాలతో కూడిన వందే భారత్ రైలు హిమాలయ ప్రాంతంలో ప్రయాణించబోతుండటం అరుదైన ఘట్టం.

ఈ రైలు కాట్రా-శ్రీనగర్ దూరాన్ని కేవలం మూడు గంటల్లోనే చేరుకుంటుంది. ఉధంపూర్-శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ (ప్రాజెక్ట్)లోని కాట్రా సంగల్డాన్ సెక్షన్‌లో ఇది చివరి దశ అవుతుంది. దీని తర్వాత, కన్యాకుమారి నుండి కాశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ పూర్తవుతుంది. కాట్రా నుండి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో దాదాపు ఆరు నుండి ఏడు గంటలు పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కాట్రా నుండి సంగల్డాన్ వరకు 272 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ రైలు భారతదేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన అంజి ఖాద్ వంతెన.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వంతెన గుండా వెళుతుంది. ఈ వంతెన ఢిల్లీ నుండి కాశ్మీర్‌కు కాట్రా ద్వారా రైల్వే మార్గాన్ని కలుపుతుంది. ఇప్పటివరకు, శ్రీనగర్, సంగల్డాన్ రైల్వే స్టేషన్ల మధ్య రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు, సంగల్డాన్, కాట్రా మధ్య సెక్షన్ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతాల మధ్య రైళ్లు నడుస్తాయి. ఈ సెక్షన్‌పై గత కొన్ని వారాలుగా ట్రయల్స్ జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..